---Advertisement---

ఏపీలో లడ్డూ సమస్య తప్ప ఇంకేమీ సమస్యలు లేవా? : అంబటి రాంబాబు

February 22, 2026

---Advertisement---

ఏపీలో (Andhra Pradesh) అసలు ప్రజల సమస్యలు పక్కనపెట్టి లడ్డూ వివాదాన్నే (Laddu Controversy) రాజకీయంగా లాగుతున్నారా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రంగా ప్రశ్నించారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) లక్ష్యం ప్రతిపక్షంపై బురద చల్లడమేనా అని విమర్శించారు. సీబీఐ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని చెప్పినా కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో నిజంగా లా అండ్ ఆర్డర్ (Law and Order) ఉందా అని ప్రశ్నించారు. పోలీసులను రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారని, తన ఇల్లు మరియు కార్యాలయంపై గంటల తరబడి దాడులు జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ కూడా పట్టించుకోలేదని అన్నారు.

రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమని, కానీ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రజలు పార్టీలకు అతీతంగా ఆలోచించాలని ఆయన కోరారు. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీ నేతలపై జరుగుతున్న ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment