---Advertisement---

సీబీఐ-సిట్ నివేదికపై అనుమానాలా? ఏపీ కేబినెట్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?

February 3, 2026

---Advertisement---

కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ (Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీ నివేదిక ఆధారంగా నేరస్తులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేసి నివేదిక సమర్పించిన నేపథ్యంలో, మరో కమిటీ అవసరమా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. సీబీఐ-సిట్ (CBI-SIT) నివేదిక ప్రభుత్వానికి నచ్చలేదా? అమరావతిలో నారాయణ కమిటీ తరహాలో మరో కమిటీని ఏర్పాటు చేసి పరిస్థితిని మళ్లించేందుకు ప్రయత్నమా? ప్రభుత్వ చర్యలు టీడీపీ (Telugu Desam Party) తీవ్ర ఒత్తిడిలో ఉందనే భావనకు దారితీస్తున్నాయనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment