ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. వైసీపీ (YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) రావడంతో కుటుంబ సభ్యులు అత్యవసరంగా హైదరాబాద్కు తరలించారు.
బొత్స సత్యనారాయణను హైదరాబాద్లోని (Hyderabad) సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి (City Neuro Center Hospital)లో చేర్పించి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణుల వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తుంది.
ఈ పరిణామంతో ఆయన అనుచరులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు అధికారిక ప్రకటన ద్వారా వెలువడే అవకాశం ఉంది.






