పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) మరియు ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్ (Dr. Masoud Pezeshkian) మధ్య ఫోన్ (Phone Conversation) ద్వారా కీలక చర్చ జరిగింది. ఇరాన్లో (Iran) నెలకొన్న పరిస్థితులు, పౌరుల ప్రాణ నష్టం, పౌర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భారతీయుల భద్రత (Safety of Indians), ఇంధన సరఫరా (Energy Supply), అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం వంటి అంశాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో శాంతి, స్థిరత్వం అవసరమని మోడీ పేర్కొన్నారు.
ఫోన్ సంభాషణ అనంతరం మోడీ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ పశ్చిమాసియాలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణ నష్టం, మౌలిక సదుపాయాల నష్టం వంటి అంశాలపై తన ఆందోళనను ఇరాన్ అధ్యక్షుడికి తెలియజేసినట్లు చెప్పారు.
అదేవిధంగా గతంలో జరిగిన యుద్ధ పరిస్థితుల సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా మోడీ గుర్తు చేశారు. ప్రజలపై భారం పడకుండా తీసుకున్న చర్యలు, వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులను సరైన ధరలకు అందించిన విధానం వంటి అంశాలను వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, మార్కెట్లో తారుమారులు లేదా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా గత నెల ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్త దాడుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలతో గల్ఫ్ ప్రాంత దేశాలపై దాడులు జరిపింది. అంతేకాకుండా కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది.






