పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరియు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్లో రాబోయే భారీ ప్రాజెక్ట్ శరవేగంగా ముందుకు సాగుతోంది. సురేందర్ రెడ్డి గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్పై పని చేసి, పవన్తో చర్చల అనంతరం కథను ఫైనల్ చేసుకున్నట్లు సమాచారం. చిత్రబృందం పవన్ డేట్స్కు అనుగుణంగా త్వరగా షూటింగ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
హీరోయిన్ ఎంపిక ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. మొదట సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా సాక్షి వైద్య (Sakshi Vaidya)ను హీరోయిన్గా నిర్ణయించనున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ చిత్రంలో మెప్పించిన సాక్షి, పవన్ సరసన నటించేందుకు రెడీగా ఉంది. రామ్ తాళ్లూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు త్వరలో టెక్నికల్ క్రూ వివరాలు కూడా అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది.






