భారత క్రికెట్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్థానంలో, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.
ద్రవిడ్ నాయకత్వంలో టీమిండియా 2024 టీ20 ప్రపంచకప్ను గెలుచుకోవడంతో పాటు, స్వదేశీ–విదేశీ పర్యటనల్లో అద్భుత విజయాలు సాధించింది. కోచ్గా ఉన్న సమయంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం, భవిష్యత్ జట్టు నిర్మాణంపై స్పష్టమైన దృష్టి పెట్టడం ద్రవిడ్ ప్రత్యేకతగా నిలిచాయి.
రాబోయే సంవత్సరాల్లో భారత్(India)కు వరుసగా ఐసీసీ టోర్నీలు ఉండటంతో, సెలక్షన్ ప్రక్రియలో కొత్త ఆలోచనల అవసరం ఉందని బోర్డు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అపార అనుభవం కలిగిన రాహుల్ ద్రవిడ్ పేరును బీసీసీఐ పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మార్పు నిజమైతే, భారత జట్టు ఎంపిక ప్రక్రియలో మరింత స్థిరత్వం, పారదర్శకత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.








