తిరుపతి (Tirupati) జిల్లాలోని రేణిగుంట (Renigunta) ప్రాంతంలో గంజాయి (Cannabis) మత్తులో ఓ యువకుడు కత్తితో (Knife) వీరంగం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తితో హల్చల్ చేస్తూ తనను తాను పొడుచుకుంటూ బీభత్సం సృష్టించిన అతను చివరికి రక్తసిక్తమైన స్థితిలో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పుతుండగా, స్థానికుల సహకారంతో పోలీసులు అతికష్టం మీద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో గంజాయి సమస్యపై మళ్లీ చర్చ మొదలైంది. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చిన నేతలు ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గంజాయి విచ్చలవిడిగా తయారవుతూ, సేవించే వ్యక్తులు ఉన్మాదుల్లా ప్రవర్తించి హత్యలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలంటే గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.






