---Advertisement---

టీచర్లపై సస్పెన్షన్ వేటు.. కూటమి ప్రభుత్వంపై కక్షసాధింపు ఆరోపణలు

August 14, 2026

Summarize with AI

---Advertisement---

ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ (TET)మినహాయింపు కల్పించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం (Central Government) దృష్టికి తీసుకెళ్లిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం (Coalition Government) సస్పెన్షన్‌ (Suspension) వేటు వేయడం వివాదాస్పదంగా మారింది. ఉపాధ్యాయుల సమస్యలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి (Prahlad Joshi) దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీ వెళ్లినందుకే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎస్‌టీయూ (STU)జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర రెడ్డి(Sangameswara Reddy), వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌(YSR Teachers Association) ప్రతినిధులు వెంకటనాథ్‌ రెడ్డి(Venkatanath Reddy), అమర్‌నాథ్‌ రెడ్డిలను(Amarnath Reddy) ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి కేంద్ర మంత్రిని కలసి లక్షలాది మంది ఉపాధ్యాయుల సమస్యలను వివరించడమే వారి తప్పా? అంటూ వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.

అయితే, కడప డీఈవో (Kadapa DEO) జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో డీఎస్సీ అక్రమాలకు (DSC Irregularities) సంబంధించిన ర్యాలీలో పాల్గొన్నారనే ఆరోపణలను కారణంగా చూపినట్లు వైఎస్సార్‌సీపీ(YSRCP) పేర్కొంది. తాము డీఎస్సీ అంశంపై ఎలాంటి వినతిపత్రం సమర్పించలేదని, ఆ ర్యాలీలో కూడా పాల్గొనలేదని సంబంధిత ఉపాధ్యాయులు చెబుతున్నారని తెలిపింది.

ఉపాధ్యాయుల సమస్యలపై (Teachers’ Issues) కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినందుకు వారిపై చర్యలు తీసుకోవడం కక్షసాధింపు వైఖరికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ విమర్శించింది. ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. న్యాయమైన సమస్యలను లేవనెత్తుతున్న ఉపాధ్యాయులపై ఇలాంటి చర్యలు కొనసాగితే, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాయని హెచ్చరించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment