---Advertisement---

“మిస్ యూనివర్స్ ఇండియా 2026″కిరీటం గెలిచిన కేరళ భామ కజియా లిజ్ మెజో!

August 24, 2026

Summarize with AI

---Advertisement---

కేరళకు(Kerala) చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో(Kazia Liz Mejo) మిస్ యూనివర్స్ ఇండియా 2026(Miss Universe India 2026) కిరీటాన్ని(Crown) కైవసం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆగస్టు 23న నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో దేశవ్యాప్తంగా వచ్చిన పలువురు అందాల భామలను వెనక్కి నెట్టి కజియా విజేతగా నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత మణికా విశ్వకర్మ(Manika Vishwakarma) కజియాకు కిరీటాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.

మిస్ యూనివర్స్ ఇండియా 2026 కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆడిషన్లు, ఇంటర్వ్యూలు నిర్వహించి పోటీదారులను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 52 మంది ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నారు. చివరి దశల్లో పోటీదారుల అందం మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన ఇచ్చిన కజియా లిజ్ మెజో చివరకు విజేతగా నిలిచారు.

ఫలితాల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్(Vaishnavi Ganesh) మొదటి రన్నరప్‌గా నిలవగా, గుజరాత్‌కు చెందిన అనుశ్రీ సతావలేకర్ (Anushree Satavlekar) రెండో రన్నరప్‌గా ఎంపికయ్యారు. దీంతో కజియా లిజ్ మెజో, వైష్ణవి గణేష్, అనుశ్రీ సతావలేకర్ పోటీలో మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నారు.

ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా ఫినాలేలో ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1994లో భారత్‌కు(India) తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించిన సుష్మితా సేన్ న్యాయనిర్ణేతల బృందానికి నేతృత్వం వహించారు. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా విజేతలు సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా, రియా సింఘాతో పాటు ప్రజ్ఞా కపూర్, విషా లధియా, అన్నా బ్లాంకో, డాక్టర్ స్టుటి ఖరే శుక్లా తదితరులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.

మిస్ యూనివర్స్ ఇండియా కిరీటంతో కజియా లిజ్ మెజోకు మరో కీలక అవకాశం కూడా దక్కింది. అంతర్జాతీయ వేదికపై(International Stage) భారత్‌కు(India) ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆమెకు లభించింది. నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో కజియా భారత్ తరఫున పోటీ పడనున్నారు.

తన విజయంపై కజియా మాట్లాడుతూ.. ఈ కిరీటం తనకు కేవలం అందాల పోటీలో సాధించిన విజయం మాత్రమే కాదని, ఇది ఒక గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతి, దేశ ప్రతిభ, కొత్త తరం ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పాలని ఆమె ఆకాంక్షించారు. మిస్ యూనివర్స్ కిరీటాన్ని కూడా భారత్‌కు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు.

సుష్మితా సేన్, లారా దత్తా, హర్నాజ్ సంధు వంటి భారతీయ అందాల భామలు గతంలో మిస్ యూనివర్స్ కిరీటాలను సాధించారు. ఇప్పుడు కజియా లిజ్ మెజో కూడా వారి బాటలో నడిచి అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మరో కిరీటం అందిస్తారా అనే ఆసక్తి నెలకొంది. 19 ఏళ్ల ఈ కేరళ యువతి ప్యూర్టో రికోలో ఎలా రాణిస్తారనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment