మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్కు (Jr NTR)విజయవంతంగా శస్త్రచికిత్స(Surgery) పూర్తయింది. భుజానికి గాయం(Shoulder Injury) కావడంతో కిమ్స్ ఆసుపత్రిలో (KIMS Hospital) వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం తారక్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్య వర్గాలు వెల్లడించాయి.
జూనియర్ ఎన్టీఆర్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందన్న విషయం తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు తారక్ త్వరగా కోలుకోవాలని(Speedy Recovery) కోరుకుంటూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
గత నెల 27న జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం అయినట్లు ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్న తారక్కు తాజాగా కిమ్స్లోని నిపుణులైన వైద్యుల బృందం విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసింది.
సర్జరీ అనంతరం కొంతకాలం విశ్రాంతి, కోలుకునే సమయం తీసుకున్న తర్వాత తారక్ మళ్లీ షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ అంచనాల చిత్రం ‘డ్రాగన్’(Dragon) షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ తిరిగి పాల్గొనే అవకాశం ఉంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ కోలుకున్న వెంటనే చిత్రీకరణను కొనసాగించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.







