తమిళనాడు సీఎం (Tamil Nadu CM) విజయ్ (Vijay) కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు(Farmers), టీచర్లకు (Teachers) సంబంధించిన పలు కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం అసెంబ్లీలో(Assembly) ప్రకటించారు. జీవనోపాధి(Livelihood), హక్కులు(Rights), న్యాయమైన డిమాండ్ల(Legitimate Demands) కోసం శాంతియుతంగా నిర్వహించిన ఆందోళనలకు సంబంధించి 2021 మే నుంచి 2026 ఏప్రిల్ మధ్య నమోదైన కేసులన్నింటినీ వెనక్కి తీసుకుంటామని వెల్లడించారు.
మానవతా దృక్పథంతో పాటు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం రైతులు, టీచర్లపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసిందని సీఎం విజయ్(CM Vijay) విమర్శించారు. ఈ కేసుల కారణంగా వారి ప్రజాస్వామ్య హక్కులు (Democratic Rights) దెబ్బతినడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రైతులు, టీచర్ల న్యాయమైన డిమాండ్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం విజయ్ స్పష్టం చేశారు. తిరువణ్ణామలై జిల్లాలో పారిశ్రామిక ఎస్టేట్కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఆ నిరసనల్లో పాల్గొన్న కొందరు రైతులపై గూండాస్ చట్టం (Goondas Act) కింద కూడా కేసులు నమోదు చేశారని తెలిపారు.
పరందూర్లో ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు సంబంధించిన కేసులను కూడా ఉపసంహరించుకుంటామని సీఎం విజయ్ ప్రకటించారు. విమానాశ్రయం నిర్మాణం వల్ల వ్యవసాయ భూములు, నీటి వనరులు, జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
రైతులు, టీచర్లపై నమోదైన కేసుల ఉపసంహరణ ప్రజాస్వామ్య హక్కులను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నమ్మకాన్ని పెంచుతుందని సీఎం విజయ్ అన్నారు.
అయితే సీఎం విజయ్ నిర్ణయంపై డీఎంకే స్పందించింది. రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం ఇదే తొలిసారి కాదని పేర్కొంది. డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన 5000కు పైగా కేసులను ఉపసంహరించుకున్న విషయాన్ని ఆ పార్టీ గుర్తుచేసింది.
పౌరసత్వ సవరణ చట్టం, మూడు వ్యవసాయ చట్టాలు, కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను కూడా తమ ప్రభుత్వం ఉపసంహరించుకుందని డీఎంకే నేత స్టాలిన్ పేర్కొన్నారు.







