---Advertisement---

జూడాల డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం వెనకడుగు?

August 22, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యుల సమ్మె(Junior Doctors Strike) 12వ రోజుకు చేరినా ప్రభుత్వం(Government) తమ న్యాయమైన డిమాండ్లపై స్పందించడం లేదని జూడాలు(Junior Doctors – JUDAs) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని వారు తెలిపారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలు(Government Medical Colleges), బోధనాస్పత్రుల్లో జూనియర్ వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో వైద్య సేవలపై ప్రభావం పడుతోంది. పలు జిల్లాల్లో శస్త్రచికిత్సలు కూడా నిలిచిపోయినట్లు సమాచారం. ప్రభుత్వం తమతో నేరుగా చర్చలు జరపకుండా అధికారుల ద్వారా ప్రకటనలు చేయిస్తోందని జూనియర్ వైద్యులు మండిపడుతున్నారు.

పెరిగిన నిత్యావసర ధరలకు (Essential Commodity Prices) అనుగుణంగా తమ స్టైపెండ్‌ను(Stipend) కనీసం 20 నుంచి 30 శాతం వరకు పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచకూడదని, పోస్టుల భర్తీలో ఎండీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. తెలంగాణలో జూనియర్ వైద్యులకు తమకంటే అధికంగా స్టైపెండ్ అందుతోందని, తాము కూడా ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా ప్రభుత్వ వైద్య వ్యవస్థకు కీలక సేవలు అందిస్తున్నామని గుర్తు చేస్తున్నారు.

మరోవైపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం జూనియర్ వైద్యుల స్టైపెండ్‌ను భారీగా పెంచడం సాధ్యం కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్(Satyakumar Yadav) తెలిపారు. ఈ ఏడాది 5 శాతం, వచ్చే ఏడాది 3 శాతం చొప్పున పెంపు ఉంటుందని వెల్లడించారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ పీజీ వైద్యులకు ఏటా 3 శాతం పెంపు ఇస్తామని పేర్కొన్నారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని కూడా స్పష్టం చేశారు.

అయితే, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో కరోనా వంటి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూడా జూనియర్ వైద్యుల స్టైపెండ్‌ను పలుమార్లు పెంచారని జూడాలు గుర్తు చేస్తున్నారు. ఒక దశలో 42 శాతం పెంపు కోరినప్పటికీ, కరోనా సమయంలో ప్రభుత్వం 15 శాతం పెంపు ఇచ్చిందని, జగన్ హయాంలో అత్యధికంగా 17 శాతం వరకు స్టైపెండ్ పెరిగిందని వారు చెబుతున్నారు.

ఇప్పుడు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా కనీసం 20 శాతం స్టైపెండ్ పెంపు కోరుతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం(Coalition Government) ఆర్థిక లోటును(Financial Deficit) కారణంగా చూపుతూ కేవలం స్వల్ప పెంపునే ప్రతిపాదిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ వైద్యుల సమస్యలపై ప్రభుత్వం నేరుగా చర్చించి పరిష్కారం చూపే వరకు సమ్మె కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేయడంతో, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రభావం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment