---Advertisement---

కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోంది: “హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్” అంటూ జగన్ ట్వీట్

July 5, 2026

Summarize with AI

---Advertisement---

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) శాంతి భద్రతల (Law and Order) పరిస్థితి, పోలీసు వ్యవస్థ (Police System) పనితీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ అణచివేత కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదకర దిశగా నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై (Nara Chandrababu Naidu) ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

జగన్ తన ట్వీట్ లో, చిన్నారులు అదృశ్యమైన ఘటనలు, మహిళలపై దాడులు, గిరిజన మహిళలపై జరిగిన అమానుష ఘటనలు, లాకప్ డెత్ (Lockup Death) కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిపై మాత్రం వేగంగా కేసులు నమోదు చేసి, అరెస్టులు చేసి, నాన్-బెయిలబుల్ సెక్షన్లు విధిస్తున్నారని ఆరోపించారు.

కాకినాడ జిల్లా తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి (Gnaneshwari) అదృశ్యమైన ఘటనలో ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలిపై (Mentally Challenged Woman) లైంగిక దాడి (Sexual Assault) ఘటనలో కేసు నమోదు ఆలస్యం చేయడం, నెల్లూరు జిల్లా కావలిలో గిరిజన మహిళపై (Tribal Woman) జరిగిన దాడి కేసులో నిందితులను అరెస్టు చేయకపోవడం పోలీసు వ్యవస్థ వైఫల్యమని విమర్శించారు.

సాయికృష్ణ లాకప్ డెత్ (Sai Krishna Lockup Death), క్రాంతికుమార్ (Kranthi Kumar) ఆత్మహత్య కేసు, గంగమ్మ(Gangamma), తిరుపతమ్మల(Tirupatamma) లాకప్ డెత్‌లు, కళావతి ఆత్మహత్య వంటి ఘటనలను ప్రస్తావిస్తూ, ఈ కేసుల్లో ఇప్పటికీ సమాధానాలు లేవని జగన్ పేర్కొన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు.

సోషల్ మీడియా యాక్టివిస్టులు, యూట్యూబర్లు, జర్నలిస్టులపై కఠిన చట్టాలు ప్రయోగిస్తూ, బెయిల్ రాని సెక్షన్లు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నారనే సమాచారం వస్తోందని జగన్ ఆరోపించారు. యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కేవీఆర్, యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులను ప్రస్తావిస్తూ, విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

నాలుగు కేసుల్లో కోర్టులు బెయిల్(Bail) మంజూరు చేసినప్పటికీ ప్రశ్న రావణ్‌పై మరిన్ని తీవ్రమైన అభియోగాలు నమోదు చేయడం, సంబంధిత పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగినా పోలీసులు మౌనం వహించారని జగన్ విమర్శించారు. గతంలో టీడీపీ(TDP) నాయకులు చేసిన వ్యాఖ్యలతో పోల్చితే, ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు చేసిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేయడం చట్టం ముందు సమానత్వానికి విరుద్ధమని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) రౌడీ పోలీస్ రాజ్యం లేదా జంగిల్ రాజ్ అవసరం లేదని, ప్రజలకు భద్రత కల్పించే, బాధితులకు న్యాయం చేసే, రాజ్యాంగానికి లోబడి పనిచేసే పోలీసు వ్యవస్థ కావాలని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చివరగా “హే రామ్ (Hey Ram).. సేవ్ ఆంధ్రప్రదేశ్(Save Andhra Pradesh)” అంటూ రాష్ట్ర పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment