కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేష్పై(Nara Lokesh) మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవసాయం గురించి లోకేష్కు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. తాను చూపించే 5 వ్యవసాయ మొక్కల పేర్లను లోకేష్ సరిగ్గా గుర్తించి చెబితే తాను రాజకీయాలను (Politics) శాశ్వతంగా వదిలేస్తానని కాకాణి సవాల్ విసిరారు. రైతుల (Farmers) గురించి మాట్లాడే ముందు వ్యవసాయం గురించి తెలుసుకోవాలని సూచించారు.
చంద్రబాబు ప్రభుత్వం పాలన (Chandrababu Government Governance) కంటే దోపిడీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని కాకాణి మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ (Jagan Government హయాంలో రాష్ట్రానికి ఆదాయ వనరులు (Revenue Sources) పెంచేలా చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు అదే ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం(YSRCP Government) నిర్మించిన రామాయపట్నం పోర్టును (Ramayapatnam Port) ప్రైవేటీకరించేందుకు (Privatization) ప్రయత్నించడం ఇందుకు పెద్ద ఉదాహరణ అని విమర్శించారు.
ఈ ప్రభుత్వ హయాంలో గ్రావెల్ తవ్వకాల (Gravel Mining) నుంచి నిరుద్యోగులు (Unemployed) ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) వరకు ప్రతి అంశంలో అవినీతి(Corruption), అక్రమాలు (Irregularities) చోటుచేసుకుంటున్నాయని కాకాణి ఆరోపించారు. ప్రతి పథకంలో పారదర్శకత కనిపించడం లేదని, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల ప్రయోజనాల కంటే ఇతర ప్రయోజనాల కోసమే తీసుకుంటున్నట్లు పరిస్థితులు ఉన్నాయని అన్నారు.
కూటమి ప్రభుత్వం (Alliance Government) అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి వ్యవహారాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని కాకాణి పేర్కొన్నారు. సరైన సమయంలో ప్రజలే ఈ ప్రభుత్వానికి గట్టి సమాధానం చెబుతారని హెచ్చరిస్తూ తన విమర్శలను మరింత పదునుపెట్టారు.







