జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) అభిమానుల పేరిట భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) సంస్థ ఇప్పుడు అనూహ్యంగా తన కార్యకలాపాలకు గుడ్బై చెప్పింది. కొద్ది రోజులుగా వార్తల్లో హాట్ టాపిక్గా నిలిచిన ఈ సంస్థ, ఇకపై తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమ ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో “విజయం సాధించిన వారందరికీ అభినందనలు” అంటూ వ్యంగ్యంగా వీడ్కోలు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ మొత్తం వివాదానికి కారణం ‘ఊరు-వాడ’ (Ooru-Wada) పేరుతో ప్రకటించిన సేవా కార్యక్రమాలే. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా రూ.100 కోట్లతో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సంస్థ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపై పడింది. ఈ ప్రకటన తర్వాత తమిళ హీరో విజయ్ (Tamil Hero Vijay) అభిమాన సంఘాలు చేపట్టిన సేవా కార్యక్రమాల తరహాలోనే ఇది కూడా సాగుతుందనే ప్రచారం మొదలైంది. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే తొలి అడుగు కావచ్చంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అయితే ఈ ప్రచారానికి త్వరలోనే బ్రేక్ పడింది. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం (Junior NTR Office) అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ‘రా ఎన్టీఆర్’(RAW NTR) సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరు, ఇమేజ్ను ఉపయోగించి కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. దీంతో నందమూరి అభిమానుల్లో కూడా ఈ సంస్థపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
వివాదం మరింత ముదరడంతో సంస్థ ప్రతినిధి సాయి రూప్ (Sai Roop) తిరుపతిలో (Tirupati) మీడియా సమావేశం నిర్వహించి తమ ఉద్దేశం పూర్తిగా సామాజిక సేవేనని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రూ.100 కోట్ల నిధులను ఎలా సమీకరిస్తారనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో సోషల్ మీడియాలో విమర్శల దాడి కూడా మరింత ఎక్కువైంది.
ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు 🙏🏻 pic.twitter.com/8fCvNuXvkD
— RAW NTR (@RAWNTR) July 22, 2026
ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పష్టమైన ప్రకటన, మరోవైపు అభిమానుల నుంచి పెరుగుతున్న వ్యతిరేకతతో సంస్థపై ఒత్తిడి పెరిగింది. చివరకు ఈ పరిణామాల మధ్య ‘రా ఎన్టీఆర్’ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో సినీ, రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. అసలు ‘రా ఎన్టీఆర్’ వెనుక ఉన్నవారు ఎవరు? ఈ సంస్థ ఎందుకు ఒక్కసారిగా వెనక్కి తగ్గింది? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.






భర్త చనిపోతే బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి? అనసూయ వైరల్ వీడియో!