తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వెయ్యి రోజుల పాలన (1,000 Days Governance) పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. వెయ్యి రోజులుగా ప్రజలకు నరకం చూపిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను ప్రజా పీడనగా (Public Harassment) అభివర్ణిస్తూ బీఆర్ఎస్ తరఫున ఛార్జ్షీట్ (Charge Sheet) విడుదల చేశారు.
కాంగ్రెస్ అభయహస్తం (Abhaya Hastam) మేనిఫెస్టోను (Manifesto) ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసంగా కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి, కమీషన్లు, పర్సంటేజీల పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఢిల్లీ ముందు మోకరిల్లిన పాలనగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివర్ణించారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ జలగల పాలన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో సుమారు రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వంలో అసమర్థత, అవినీతి, అరాచకం తీవ్రస్థాయికి చేరాయని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రోజుల్లో వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన రైతు బీమా పథకాన్ని(Rythu Bima Scheme) కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
రైతుబంధు బంద్ అయ్యి.. రాహుల్ బంధు మొదలైందంటూ రాహుల్ గాంధీపై (Rahul Gandhi) కేటీఆర్ విమర్శలు చేశారు. రైతుల డబ్బులను(Farmers’ Money) దోచుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్కు ఓటు వేసిన యువతకు (Youth) ఈ ప్రభుత్వంలో ఏం మిగిలిందని ప్రశ్నించారు.
2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు (Polytechnic Students) సంబంధించిన జీవో నంబర్ 97 అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు.
అప్పులు, అవినీతి, రైతులు, నిరుద్యోగం, నీటి సమస్యలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను బీఆర్ఎస్ తన ఛార్జ్షీట్లో ప్రధానంగా ప్రస్తావించింది. వీటిని ఆధారంగా చేసుకుని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.







