---Advertisement---

జలంధర్‌లో సంచలనం: గురుద్వారా వద్ద ఆప్ నాయకుడిపై కాల్పులు.. ఒబెరాయ్ హత్య

February 6, 2026

---Advertisement---

మోడల్ టౌన్‌లో జరిగిన ఘటనతో ఉలిక్కిపడ్డ పంజాబ్ రాజకీయ వర్గాలు

పంజాబ్‌లోని జలంధర్ నగరం (Ludhiana City)లో కాల్పుల ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఆమ్ ఆద్మీ (AAP) పార్టీకి చెందిన నాయకుడు లక్కీ ఒబెరాయ్‌ (Lucky Oberoi)ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. మోడల్ టౌన్ ప్రాంతంలోని ఒక గురుద్వారా (Gurudwara) వెలుపల కారులో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఒబెరాయ్‌పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. లక్కీ ఒబెరాయ్ భార్య గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం గమనార్హం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment