---Advertisement---

99 పైసలకే వేల కోట్ల భూములా? –వరుదు కళ్యాణి

February 12, 2026

---Advertisement---

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) పరిశ్రమల పేరుతో విలువైన భూములను (Lands) కారు చౌకగా కట్టబెడుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (Varudu Kalyani) తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో ఎకరానికి రూ.150 కోట్ల వరకు ధర పలుకుతున్న భూములు ఉన్నప్పటికీ, అదే స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో భూములను అతి తక్కువ ధరలకు ఎలా కేటాయిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. “99 పైసలకు టీ కూడా రాదు; అలాంటిది వేల కోట్ల విలువైన భూములను ఎలా కట్టబెడతారు?” అంటూ ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా ప్రశ్నించారు. పరిశ్రమల ప్రోత్సాహం పేరిట జరుగుతున్న ఈ భూ కేటాయింపుల వెనుక పారదర్శకత ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రజాసంపదను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment