ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మండలిలో మాట్లాడుతూ, “అంబటి రాంబాబు (Ambati Rambabu) తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా?” అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వేసిన కేసులపై ఆయన శాసనమండలిలో మాట్లాడారు. అంబటిపై దాడులు జరిగితే ఆయన ఘాటుగా స్పందించారని, ఆ తరువాత తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తూ క్షమాపణ వ్యక్తం చేశారని బొత్స గుర్తుచేశారు.
బొత్స వ్యాఖ్యల ప్రకారం, అంబటిని వేధించిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రజా స్వామ్యంలో ప్రజా ప్రతినిధులపై దాడులు చేయడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. అంబటి రాంబాబు తల్లి (Mother).. తల్లి కాదా అని, ఎవరి తల్లి అయినా ఆ గౌరవం రక్షించబడాలి అని పేర్కొన్నారు. మహిళలతో సంబంధం ఉన్న వ్యవహారాల్లో ఎవరూ తప్పు చేసినా తప్పేనని, అంబటి రాంబాబు తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణ తెలిపారు.






