---Advertisement---

అంబటి గుంటూరు ప్రయాణం – పోలీస్ ఆంక్షలు

February 19, 2026

---Advertisement---

నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నేడు గుంటూరుకు బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణానికి అనూహ్యంగా అడ్డంకులు ఎదురయ్యాయి. అంబటి వాహనం వెనుక మూడుకు మించి వాహనాలు ఉండకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాన్వాయ్‌గా వస్తున్న పలు వాహనాలను నిలిపివేశారు. ఈ చర్యలపై జక్కంపూడి రాజాతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబు తన వాహనం నుంచి దిగిపోతూ వెనక్కి వచ్చారు. పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, “మీరు అనుమతిస్తే కారులో గుంటూరుకు వెళ్తాను, లేకపోతే పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధం” అని స్పష్టం చేశారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా ప్రయాణిస్తున్న తనను అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు.

రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన నివాసంపై జరిగిన విధ్వంస సమయంలో 30 యాక్ట్ ఎందుకు అమలు కాలేదని, ఇప్పుడు మాత్రం ఆ చట్టాన్ని ప్రస్తావించడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు ప్రత్యక్షంగా ఉండి తన ఇంటిని ధ్వంసం చేయించారని ఆరోపిస్తూ, ఆ రోజు చట్టం ఎక్కడుందని నిలదీశారు.

తాను ఎట్టి పరిస్థితుల్లోనైనా గుంటూరుకు చేరుతానని, కారులో వెళ్లేందుకు అనుమతి లేకపోతే పాదయాత్ర ప్రారంభిస్తానని హెచ్చరిస్తూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment