టి20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) ఫైనల్లో న్యూజిలాండ్పై (New Zealand) 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ మూడోసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ (Sanju Samson) 89 పరుగులతో అద్భుతంగా రాణించి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. అతని ప్రదర్శనకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు (Award) ప్రకటించింది.
అయితే ఈ నిర్ణయంపై పాకిస్తాన్ (Pakistan) ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ అవార్డు (Award) తనకే రావాల్సిందని, సంజూ శాంసన్కు ఇవ్వడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. అవసరమైతే ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తానని కూడా అతడు తెలిపాడు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.






