టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) ఫైనల్లో న్యూజిలాండ్పై (New Zealand) 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టైటిల్ గెలిచిన టీమ్ ఇండియాకు (Team India) బీసీసీఐ (BCCI) భారీ నజరానా ప్రకటించింది. జట్టు విజయం గుర్తుగా మొత్తం రూ.131 కోట్ల బహుమతిని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్ మధ్య పంచనున్నారు.
ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడి 89 పరుగులు చేసిన సంజూ శాంసన్ (Sanju Samson) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు. జట్టు ప్రదర్శన, పట్టుదల, దేశ ప్రతిష్టను పెంచినందుకు ఈ బహుమతి ప్రకటించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.






