---Advertisement---

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు: మరోసారి జగన్ పాలనలో మహిళా సాధికారతపై చర్చ

April 17, 2026

---Advertisement---

పార్లమెంట్‌లో (Parliament) మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill) ప్రవేశపెట్టిన చారిత్రాత్మక సందర్భంలో దేశవ్యాప్తంగా మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) గతంలో జగన్ ప్రభుత్వం (Jagan Government) మహిళలకు కల్పించిన అగ్రగామి అవకాశాల గురించి చర్చించడం సందర్భోచితమని పలువురు మహిళా నేతలు అభిప్రాయపడుతున్నారు.

మహిళా శక్తిని (Women Power) కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా, వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా శక్తివంతులను చేయడమే లక్ష్యంగా నాటి ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని వారు గుర్తు చేస్తున్నారు. రాజకీయ సాధికారతలో భాగంగా, దేశ చరిత్రలోనే అరుదైన విధంగా నామినేటెడ్ పదవులు మరియు పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తూ చట్టం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదని చెబుతున్నారు.

రాష్ట్ర మంత్రివర్గంలో హోం మంత్రిగా(Home Minister), ఉప ముఖ్యమంత్రిగా (Deputy Chief Minister) మహిళలకు అవకాశం కల్పించడంతో పాటు, చట్టసభల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో కూడా మహిళలకు పెద్దపీట వేశారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 7 (50% పైగా) మహిళలకు కేటాయించడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశమని వారు అంటున్నారు. నగర మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 50 శాతానికి పైగా మహిళలే బాధ్యతలు చేపట్టారు. చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమించారు.

‘అమ్మ’కు భరోసా (Mother Assurance) కల్పించే దిశగా మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచేందుకు ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేసే పథకాలను అమలు చేసింది. ఐదేళ్ల పాలనలో మహిళా సంక్షేమం కోసం దాదాపు రూ. 2.84 లక్షల కోట్లు ఖర్చు చేశారు. పొదుపు సంఘాల మహిళల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ రూ. 25,571 కోట్ల రుణ మాఫీని నాలుగు విడతల్లో అమలు చేశారు. సున్నా వడ్డీ పథకం ద్వారా పొదుపు సంఘాలకు ఊతమిచ్చారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ‘చేయూత’(Cheyutha) పథకం ద్వారా, అగ్రవర్ణ పేద మహిళలకు ‘ఈబీసీ నేస్తం’(EBC Nestham) ద్వారా ఏటా రూ. 18,750 చొప్పున ఆర్థిక సాయం అందించారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 అందిస్తూ దాదాపు 44.48 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చారు.

మహిళల పేరిట 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, వాటిని రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా వారికి సామాజిక, ఆర్థిక భరోసా కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన జగనన్న కాలనీల్లో ఇళ్లు కూడా మహిళల పేర్లపైనే ఉండటం వారి ఆత్మగౌరవాన్ని పెంచింది. మహిళా భద్రత కోసం ‘దిశా చట్టం’ (Disha App) తీసుకురావడంతో పాటు, ఆపదలో ఉన్న మహిళలను రక్షించడానికి ‘దిశా యాప్’, ప్రత్యేక దిశా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీసులను నియమించి భద్రతను గ్రామ స్థాయికి తీసుకెళ్లారు.

ఆరోగ్య పరంగా, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం (YSR Sampoorna Poshana) ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించారు. పాఠశాల విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నాప్కిన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు. మొత్తంగా చూస్తే, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళల అభ్యున్నతి కోసం విప్లవాత్మక మార్పులు జగన్ పరిపాలనలో చోటుచేసుకున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మహిళల అభివృద్ధిని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పెద్ద మొత్తంలో లబ్ధిని మహిళలకే అందించిన జగన్ పరిపాలన, వారిని నిజమైన ‘శక్తి స్వరూపిణులు’ (Women Empowerment) గా తీర్చిదిద్దిందని చెప్పవచ్చు. పార్లమెంట్ రిజర్వేషన్ల కంటే ముందే ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారతను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపిన ఘనత ఈ ప్రభుత్వానిదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment