---Advertisement---

అన్నమయ్య జిల్లాలో కలకలం: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్త

February 22, 2026

Summarize with AI

---Advertisement---

అన్నమయ్య (Annamayya) జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ (Minor Girl Kidnap) ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ములకలచెరువు మండలం నాయనచెరువు పల్లెకు చెందిన హరినాథ్ (Harinath) అనే వ్యక్తి బాలికను అపహరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, బాలిక అదే మండలానికి చెందినదని, కొంతకాలంగా హరినాథ్ ఆమెను వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. హరినాథ్, తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ (JanaSena Party) ఇంచార్జి పోతుల సాయినాథ్ సోదరుడిగా (Pothula Sainath Brother) స్థానికులు చెబుతున్నారు. దీంతో కేసు ప్రాధాన్యం పెరిగింది.

పోలీసులు బాలికను గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేసి, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment