బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(Andhra Pradesh Politics) కొత్త చర్చకు దారితీశాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ప్రచారం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై (Chandrababu Government) జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయించి, ఇప్పుడు మళ్లీ బీసీల కోసం పోరాడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 176 ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని జగన్ తెలిపారు. అయితే రిజర్వేషన్లు 50 శాతం (50 Percent) పరిమితిని దాటుతున్నాయనే కారణంతో హైకోర్టు వాటిని రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ అంశంలో అప్పట్లో టీడీపీకి(TDP) సంబంధించిన వ్యక్తుల ద్వారా న్యాయస్థానాల్లో కేసులు వేయించారని ఆయన ఆరోపించారు.
కోర్టులు రిజర్వేషన్లను రద్దు చేసినప్పటికీ, బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని జగన్ పేర్కొన్నారు. తన మంత్రివర్గంలో(Cabinet) 25 మందిలో 11 మంది బీసీలకు చోటు కల్పించామని, ఇద్దరు బీసీలకు ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) పదవులు ఇచ్చామని వివరించారు. రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, మేయర్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ వంటి అనేక పదవుల్లో బీసీలకు గణనీయమైన ప్రాతినిధ్యం కల్పించామని చెప్పారు.
139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, నామినేటెడ్ పదవులు, పనులు, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం అవకాశం కల్పించే విధానాన్ని తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంట్లో(Parliament) ప్రైవేట్ బిల్లు (Private Bill) ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్, బీసీ కులగణన కోసం తమ పార్టీ పోరాడిందని తెలిపారు.
వివిధ డీబీటీ పథకాల (DBT Schemes) ద్వారా బీసీల ఖాతాల్లోకి రూ.1.30 లక్షల కోట్ల మేర నిధులు జమ చేశామని జగన్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు గతంలో అమలు చేసిన పథకాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. రాజకీయంగా ఎదుగుతున్న బీసీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని కూడా విమర్శించారు.
బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఎవరిదనే ప్రశ్నను జగన్ తన ప్రెస్మీట్లో ప్రధానంగా లేవనెత్తారు. ఒకవైపు రిజర్వేషన్ల పేరుతో ప్రచారం చేస్తూనే, మరోవైపు గతంలో వాటికి అడ్డంకులు సృష్టించారని చంద్రబాబుపై ఆయన ఆరోపించారు. దీంతో బీసీ రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం అంశంపై జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబు బీసీ రాజకీయానికి సవాల్గా మారాయనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.







