---Advertisement---

రామాయపట్నం పోర్టు డీల్‌లో ప్రైవేటుకు వరాలా? స్కాం అనుమానాలపై జగన్ ఫైర్

July 19, 2026

Summarize with AI

---Advertisement---

రామాయపట్నం పోర్టు (Ramayapatnam Port) విషయంలో కూటమి ప్రభుత్వ (Alliance Government) విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ఘాటుగా స్పందించారు. ఇప్పటికే ఈ పోర్టు అంశంపై వైసీపీ నాయకులు దఫాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో, పోర్టును ప్రైవేట్ సంస్థలకు (Private Companies) అప్పగించే ప్రక్రియపై జగన్ తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు.

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణంలో (Andhra Pradesh Economic Reconstruction) పోర్టు(Port) ఆధారిత అభివృద్ధి కీలకమని భావించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. భూసేకరణ, చట్టపరమైన అనుమతులు, ఫైనాన్షియల్ క్లోజర్, ఏపీఎచ్‌ ఒప్పందాలు వంటి కీలక ప్రక్రియలను పూర్తి చేసి, 2024 జూన్ నాటికి నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు.

రామాయపట్నం పోర్టు చుట్టూ భారీ పారిశ్రామిక పెట్టుబడులు ఏర్పడుతున్నాయని జగన్ వివరించారు. బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ (BPCL Greenfield Refinery), పెట్రోకెమికల్ కాంప్లెక్స్(Petrochemical Complex), ఇండోసోల్ సోలార్ గిగా మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్(Indosol Solar Giga Manufacturing Plant) , జేఎస్‌డబ్ల్యూ స్టీల్ బెర్త్ (JSW Steel Berth) అభివృద్ధి వంటి ప్రాజెక్టులు ఈ పోర్టు ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టులు వేలాది ఉద్యోగాలు సృష్టించడమే కాకుండా రాష్ట్రానికి భారీ పన్ను, పన్నేతర ఆదాయాలను అందించే సామర్థ్యం కలిగి ఉన్నాయని చెప్పారు.

అయితే, ఇంతటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం(TDP Government) రామాయపట్నం పోర్టును అభివృద్ధి ఆస్తిగా కాకుండా నగదు ప్రవాహాల కోసం ఉపయోగించే అవకాశంగా చూస్తోందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.4,929 కోట్లు ఖర్చు చేస్తున్న పోర్టును కేవలం రూ.1,500 కోట్ల ముందస్తు చెల్లింపుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. దీంతో రూ.3,500 కోట్లకు పైగా అప్పు భారం, వడ్డీ చెల్లింపులు ప్రభుత్వానికే మిగిలి, లాభదాయక ఆస్తి మాత్రం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని జగన్ నిలదీశారు.

“చంద్రబాబు(Chandrababu Naidu) గారు, ఇది ఎలాంటి ఆర్థిక శాస్త్రం? ప్రజల డబ్బుతో నిర్మించిన వ్యూహాత్మక పోర్టును తక్కువ విలువకు ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం అభివృద్ధి పేరుతో జరుగుతున్న డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌నా? లేక రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించే మరో స్కాంనా?” అంటూ జగన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment