పవిత్ర తిరుమల క్షేత్రానికి టిటిడి (TTD) చైర్మన్గా వ్యవహరిస్తున్న టీవీ5 చానల్ అధినేత బీఆర్ నాయుడుకు (BR Naidu) నిరసనల సెగ తగిలింది. ఆధ్యాత్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanams) చైర్మన్గా ఆయన అర్హుడు కాదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మహిళా నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడు ఉన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ (Grand Ridge Hotel) బయట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
నిరసన చేపట్టిన వారిని తెలుగుదేశం పార్టీకి చెందిన నేత జె.బి (JB) అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు గీత యాదవ్, సాయి కుమారి, పద్మజ, విజయ లక్ష్మీతో పాటు పలువురు కార్యకర్తలను తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.






