జనతాదళ్ యునైటెడ్ (Janata Dal United – JDU) జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ (Nitish Kumar) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు (Unanimously Elected). ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ బరిలో లేకపోవడంతో ఎన్నిక ఖరారైంది. పార్టీ రిటర్నింగ్ అధికారి అనీల్ ప్రసాద్ హెగ్డే (Anil Prasad Hegde) అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మధ్యాహ్నం ఆయనకు ఎన్నిక ధృవీకరణ పత్రం అందజేయనున్నారు.
వరుసగా నాలుగోసారి బాధ్యతలు
నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో పార్టీని నడిపించడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా (Sanjay Kumar Jha), కేంద్ర మంత్రి లలన్ సింగ్ (Rajiv Ranjan Singh), బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ (Shravan Kumar) వంటి సీనియర్ నేతలు ఆయన తరఫున నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కేడర్ మొత్తం నితీష్ నాయకత్వాన్నే కోరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు తెలిపారు.
నితీష్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడటమే కాకుండా, బీహార్ అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రాజ్యసభ సీట్ల కేటాయింపుపై వచ్చిన అసంతృప్తి వార్తలను సీనియర్ నేత కేసీ త్యాగి (K. C. Tyagi) ఖండించారు. నితీష్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
ప్రస్తుతం నితీష్ కుమార్ ఢిల్లీలోనే ఉండి పార్టీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.






