అమరావతి రాజధానికి (Amaravati Capital) చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ (Assembly) ఆమోదం (Approval) తెలిపిన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చ మళ్లీ మొదలైంది. అయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నేతలు రాజధాని అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుతూ రాజధాని ఒకే ప్రాంతంలో ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజల నిర్ణయంతో రాజధాని మార్చే హక్కు ఉండాలని ఆయన పేర్కొన్నారు.
చరిత్రను ఉదాహరణగా తీసుకుంటూ మద్రాస్ (Madras) నుంచి అమరావతి (Amaravati) వరకు రాజధాని మారలేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగం పేరుతో ఒకే ప్రాంతానికి రాజధానిని పరిమితం చేయడం సరైంది కాదని ధర్మాన వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.






