కాంగ్రెస్ పార్టీకి (Congress Party) రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధమవుతున్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని (Telangana) పాలన స్వతంత్రంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సూచనల మేరకు నడుస్తోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు.. మేడిగడ్డపై నిర్లక్ష్యం
కేవలం రాజకీయ లాభాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) లక్ష్యంగా చేసుకుంటున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని (Medigadda Barrage) ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన చేయడం ద్వారా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు ఆలస్యం కావడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడితే మేడిగడ్డ ప్రాముఖ్యత ప్రజలకు అప్పుడు తెలుస్తుందని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు పడే ఇబ్బందులకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బలహీనపడితే సాగునీరు, తాగునీటి కొరత తీవ్రంగా ఉంటుందని జీవన్ రెడ్డి చెప్పారు. రైతాంగాన్ని రాజకీయాలకు బలి చేయవద్దని, వెంటనే మేడిగడ్డపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తగిన నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు.






