---Advertisement---

Byreddy Siddharth Reddy: మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి ఫైర్.. “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు” అంటూ సంచలన ఆరోపణలు!

May 18, 2026

---Advertisement---

కర్నూలులో (Kurnool) వైసీపీ (YSRCP) నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ (TG Bharat) బహుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలతో పాటు పలు అంశాలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. తనకు టికెట్ రాలేదని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానిస్తున్నారని, “ఎమ్మెల్యే(MLA) కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది” అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఆత్మహత్య చేసుకున్న సతీష్ (Satish) కుటుంబానికి ఏ ఫార్మా కంపెనీ(Pharma Company)నుంచి డబ్బులు వచ్చాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని బైరెడ్డి తెలిపారు. అయితే తాను నిజాలు బయటపెడితే వెంటనే ఆ కంపెనీ నుంచి డబ్బులు ఇవ్వలేదని చెప్పిస్తారని ఆరోపించారు. ఎన్నికల ముందు తనపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి అయినా నిరూపించారా అని ప్రశ్నించారు.

“ఆడుదాం ఆంధ్రా” (Aadudam Andhra) కార్యక్రమంలో తాను రూ.600 కోట్లు తిన్నానని ఆరోపించారని, కానీ ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో కేవలం రూ.40 కోట్ల అక్రమాలే ఉన్నాయని పేర్కొన్నారు. తనపై రాజకీయంగా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

బైరెడ్డి శబరిపై (Byreddy Shabari) కూడా సిద్ధార్థ రెడ్డి విమర్శలు గుప్పించారు. “బైరెడ్డి శబరి తండ్రిని వెస్ట్ ఫెలో అని గౌరు వెంకటరెడ్డి (Gouru Venkata Reddy) అన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి(Rajashekhar Reddy) 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏమి చేశాడని మాండ్ర శివానందరెడ్డి (Mandra Sivananda Reddy) విమర్శించినప్పుడు శబరి ఎందుకు స్పందించలేదు?” అని ప్రశ్నించారు.

శబరి తండ్రి ఆమెకు ఎంబీబీఎస్, పీజీ సీట్లు కొనిచ్చారని, అలాంటి తండ్రిపై విమర్శలు వచ్చినా ఆమె స్పందించడం లేదన్నారు. అలాగే టీజీ వెంకటేష్(TG Venkatesh) గౌరవం కోల్పోయారని, అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. “మీసాలు తిప్పుకుని తిరిగేవాళ్లు మీసాలు దించుకుని మీ దగ్గరకు ఎవరు వచ్చారో చెప్పాలి” అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించిన బైరెడ్డి, “కష్టమో, నష్టమో నేను నిలబడతా. నా దగ్గర రూపాయి ఆస్తి లేదు. నాకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే” అంటూ వ్యాఖ్యానించారు. అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో కొందరు టచ్‌లో ఉన్నారని, రేపు వైసీపీ(YSRCP) మళ్లీ అధికారంలోకి వస్తే తమను కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment