---Advertisement---

డీఎస్సీ–2025 స్కామ్‌పై యువత తిరుగుబాటు.. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుంది?

July 28, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ–2025(DSC-2025) నియామకాల్లో అక్రమాలపై ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు, వారికి అండగా నిలిచిన యువత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రశ్నాపత్రం లీక్‌ (Question Paper Leak), స్పోర్ట్స్‌ కోటాలో (Sports Quota) టీచర్‌ పోస్టుల విక్రయం (Teacher Posts Sale), నియామక ఉత్తర్వుల జారీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐతో(CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

నీట్‌-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో కేంద్ర ప్రభుత్వం (Central Government) బాధ్యత వహించినట్లే, రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఎస్సీ వ్యవహారంపై బాధ్యత తీసుకోవాలని యువత కోరుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన తరహాలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

స్పోర్ట్స్‌ కోటా నియామకాలలో అవకతవకలకు ప్రభుత్వం డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌తో పాటు విడుదల చేసిన జీవో 4, జీవో 47 ప్రధాన ఆధారాలని అభ్యర్థులు పేర్కొంటున్నారు. రాత పరీక్షలు, అర్హతల విషయంలో నిబంధనలు ఉల్లంఘించి టీచర్‌ పోస్టులను విక్రయించారనే ఆరోపణలకు సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు.

తమకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకే జీవో 4, జీవో 47 తీసుకువచ్చారని నిజమైన క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు అన్యాయం చేసి, రాజకీయంగా అడ్డదారిలో సర్టిఫికెట్లు పొందిన వారికి టీచర్‌ పోస్టులు (Teacher Posts) ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరాలు జరిగాయని, అందుకు సంబంధించిన ఆడియోలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో డీఎస్సీ–2025లో నష్టపోయిన అభ్యర్థులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ(YSRCP) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు (Statewide Protests) పిలుపునిచ్చింది. ఆ పిలుపుకు స్పందించిన వేలాది మంది విద్యార్థులు, యువత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment