డెస్చ్రిప్తిఒన్: రాయలసీమలోని (Rayalaseema) ప్రసిద్ధ శైవక్షేత్రమైన మల్లయ్యకొండలో (Mallayyakonda) ఐరన్ ఓర్ మైనింగ్కు (Iron Ore Mining) అనుమతులు ఇవ్వడంపై తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. ఒకప్పుడు ఇదే కొండలో మైనింగ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ “మల్లయ్యకొండ జోలికి వస్తే శివుడు (Lord Shiva) తాండవం చేస్తాడు” అని హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే ప్రాంతంలో మైనింగ్కు అనుమతులు ఇచ్చారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
దాదాపు 1,550 హెక్టార్ల పరిధిలోని సాధుకొండ(Sadhukonda), శివపురం కొండ, ఎర్రకొండ(Errakonda) ప్రాంతాల్లో ఐరన్ ఓర్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాధుకొండలో ఏపీఎండీసీకి, శివపురం కొండలో సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్కు, ఎర్రకొండలో ఆర్.కె. ఎర్త్ రిసోర్సెస్ (R.K. Earth Resources) సంస్థకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొంటూ జారీ చేసిన జీవోలను విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి.
విజయనగర సామ్రాజ్య కాలం నాటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన మల్లికార్జున స్వామి ఆలయం (Mallikarjuna Swamy Temple) పరిసర ప్రాంతాల్లో మైనింగ్ వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, రిజర్వ్ ఫారెస్ట్లోని (Reserve Forest) వన్యప్రాణులు, జలవనరులు ప్రమాదంలో పడతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై వైఎస్సార్సీపీ(YSRCP) లోక్సభాపక్ష నేత మిథున్ రెడ్డి (P. V. Mithun Reddy) స్పందిస్తూ, మైనింగ్కు సంబంధించిన నోటిఫికేషన్లు, ఉత్తర్వులు కూటమి ప్రభుత్వమే జారీ చేసిందని ఆరోపించారు. సంబంధిత జీవోలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒకప్పుడు మల్లయ్యకొండ పవిత్రతను కాపాడాలని పిలుపునిచ్చిన చంద్రబాబు, ఇప్పుడు అదే ప్రాంతంలో మైనింగ్కు అనుమతులు ఇవ్వడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయంగానే కాకుండా ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగానూ చర్చనీయాంశంగా మారింది.






