---Advertisement---

రైతులకు మరణ శాసనం రాసిన సీఎం రేవంత్.. కేటీఆర్ తీవ్ర విమర్శలు

June 22, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణలో (Telangana) రైతుల (Farmers) పరిస్థితిపై బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ రాజ్యం (Indiramma Rajyam) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షోభాన్ని తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. రైతులు, ప్రజలు ఎన్నో ఆశలతో అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆశలను పూర్తిగా వమ్ము చేసిందని అన్నారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, వచ్చే పంట సీజన్ (Crop Season) నుంచి రాష్ట్రంలో రైతులు పండించే పంటలను కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదన్నారు. పంటల కొనుగోళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతులకు మరణ శాసనం రాసినట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర(Remunerative Price), ప్రభుత్వ కొనుగోలు (Government Procurement) హామీ లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2½ సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ప్రజల కోసం చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందని కేటీఆర్ అన్నారు. రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో పాలనపై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment