తెలంగాణ (Telangana) ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) లేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన ఎప్పుడూ పాల్గొనలేదని, ఒక్కసారి కూడా “జై తెలంగాణ”(Jai Telangana) అని నినదించలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాడిన వారికే ఆ ఉద్యమంపై మాట్లాడే అర్హత ఉంటుందని స్పష్టం చేశారు.
మంగళవారం మిడ్జిల్ మండల కేంద్రంలో దివంగత బీఆర్ఎస్(BRS) నాయకుడు మన్యం వెంకట్ రెడ్డి (Manyam Venkat Reddy) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ రావు, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి(Lakshma Reddy), శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో (RS Praveen Kumar) కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, తెలంగాణ కోసం తొలి రాజీనామా చేసిన నాయకుడు లక్ష్మారెడ్డేనని గుర్తు చేశారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన నాయకులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువరని అన్నారు.
పాలమూరు–రంగారెడ్డి (Palamuru-Ranga Reddy) ఎత్తిపోతల పథకాన్ని (Lift Irrigation Scheme) కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ ప్రయోజనాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతుల కంటే ఇతర ప్రాంతాల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
మిడ్జిల్ ప్రాంతానికి సాగునీరు అందడం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కృషి ఫలితమేనని హరీశ్ రావు పేర్కొన్నారు. చిల్వేర్ గ్రామం వద్ద దుందుభి వాగుపై వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేసిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం ముందుందని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతున్నా ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదని హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను (Promises) అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.
దివంగత మన్యం వెంకట్ రెడ్డి గ్రామాభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడిన హరీశ్ రావు, ఆయన పట్ల ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న అభిమానమే బీఆర్ఎస్కు(BRS) ఉన్న ప్రజాదరణకు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కె. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao – KCR) మరోసారి అధికారంలోకి వస్తారని, రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి ముందు కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం నుంచి మన్యం బాల్ రెడ్డి కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మాజీ మంత్రులకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







