హైదరాబాద్లో(Hyderabad) బంగారం (Gold) పేరుతో భారీ మోసం (Fraud) వెలుగులోకి వచ్చింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ (Attapur Police Station) పరిధిలో సూర్య భాయ్ (Surya Bhai) అలియాస్ ‘గోల్డ్ మ్యాన్’పై (Gold Man) పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి(CM), ప్రముఖ పోలీసు అధికారుల పేర్లను(Names) అడ్డుపెట్టుకుని కోట్ల విలువైన బంగారం ఇప్పిస్తానంటూ నమ్మబలికి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఓ వ్యాపారి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. మార్కెట్ ధర (Market Price) కంటే చాలా తక్కువ ధరకే బంగారం అందిస్తానని సూర్య భాయ్ బాధిత వ్యాపారిని నమ్మించాడు. త్వరలో ఒక కంటైనర్లో కిలోల కొద్దీ బంగారం వస్తోందని, కేవలం రూ.50 లక్షలకే 1 కిలో బంగారం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. అతని మాటలను నిజమని నమ్మిన వ్యాపారి విడతల వారీగా మొత్తం రూ.32 లక్షలను సూర్య భాయ్కు చెల్లించాడు.
అయితే డబ్బులు తీసుకున్న తర్వాత నెలలు గడిచినా బంగారం ఇవ్వకపోవడంతో బాధితుడు పలుమార్లు సూర్య భాయ్ను సంప్రదించాడు. చివరకు గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపడింది. బంగారం ఇవ్వకుండా తప్పించుకోవడంతో పాటు బాధితుడినే బెదిరించడం ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనకు ముఖ్యమంత్రి, సీఎం కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మాజీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (Police Commissioner) సజ్జనార్ (Sajjanar) తన వ్యాపార భాగస్వామి అని సూర్య భాయ్ అబద్ధాలు చెప్పినట్లు వ్యాపారి ఆరోపించాడు. వారి పేర్లను ఉపయోగిస్తూ డబ్బులు తిరిగి అడిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు తెలిపాడు.
తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా సూర్య భాయ్ అలియాస్ ‘గోల్డ్ మ్యాన్’పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనలో మరెవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.







