---Advertisement---

రేపే టీ20 ఫైనల్ పోరు… అభిషేక్ శర్మకు ఇదే చివరి అవకాశం అవుతుందా?

March 7, 2026

Summarize with AI

---Advertisement---

క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 (ICC T20 World Cup 2026) తుది పోరుకు సర్వం సిద్ధమైంది. రేపు (ఆదివారం, మార్చి 8) అహ్మదాబాద్‌లోని (Ahmedabad) నరేంద్ర మోడీ స్టేడియంలో (Narendra Modi Stadium) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లక్షలాది మంది అభిమానుల మధ్య ఈ హై-వోల్టేజ్ పోరు జరగనుంది.

సన్నద్ధమవుతున్న భారత్.. ఫామ్‌లో కివీస్
ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సేన, కివీస్‌ను ఎదుర్కోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు, న్యూజిలాండ్ (New Zealand) కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలలో భారత్‌పై కివీస్‌కు ఉన్న రికార్డు టీమిండియాను కాస్త కలవరపెడుతోంది.

అభిషేక్ శర్మ ఫామ్.. ఫ్యాన్స్‌లో ఆందోళన
భారత జట్టు విజయపథంలో దూసుకుపోతున్నా, ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫామ్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రపంచ కప్‌లో అభిషేక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టోర్నీ ప్రారంభంలో వరుసగా మూడు సార్లు డకౌట్ అవ్వడం అభిమానులను నిరాశకు గురిచేసింది. కేవలం జింబాబ్వేపై మాత్రమే 55 పరుగులతో మెరిసినా, మిగిలిన మ్యాచ్‌ల్లో (0, 0, 0, 15, 10, 9) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. సెమీఫైనల్‌లోనూ కేవలం 9 పరుగులకే వెనుదిరగడంతో, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో అతడిని కొనసాగిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తుది జట్టులో మార్పులు ఉంటాయా?
విధ్వంసకర ఓపెనర్‌గా పేరున్న అభిషేక్ శర్మను గౌతమ్ గంభీర్ఇ (Gautam Gambhir)ప్పటివరకు వెనకేసుకొచ్చారు. అయితే, ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకుని నిలబడాలంటే అనుభవం ఉన్న ఆటగాడిని తీసుకోవాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు. అభిషేక్‌ను పక్కన పెట్టి రిజర్వ్ బెంచ్‌లో ఉన్న మరో ప్లేయర్‌కు అవకాశం ఇస్తారా? లేక “బిగ్ మ్యాచ్ ప్లేయర్” అని అభిషేక్ పైనే నమ్మకం ఉంచుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గెలిస్తే చరిత్రే!
భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను వరుసగా రెండోసారి (మొత్తంగా మూడోసారి) గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో లక్ష మందికి పైగా ప్రేక్షకుల మధ్య ఈ టైటిల్ పోరు జరగనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment