మాజీ మంత్రి, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) అరెస్ట్ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కాశీబుగ్గ (Kashibugga) రోడ్డు ప్రమాదానికి (Road Accident) సంబంధం లేని కేసులో ఏ3గా చేర్చి అరెస్ట్(Arrest) చేయడం కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ(YSRCP) ఆరోపిస్తోంది. అప్పలరాజును అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, ఆయనతో పాటు కుటుంబ సభ్యులపైనా దురుసుగా వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అప్పలరాజును జైలులో(Jail) ములాఖత్ (Mulakhat) అయ్యేందుకు వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టారు. పరిమిత అనుమతులు, పోలీసుల హెచ్చరికలు ఉన్నప్పటికీ విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు జగన్కు భారీగా ప్రజలు, మహిళలు, యువత, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. పలుచోట్ల కాన్వాయ్ (Convoy) ఆగడంతో జగన్ ప్రజలను అభివాదం చేస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు.
జగన్ పర్యటనను పరిమితం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ప్రజా స్పందన ముందు ఫలించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. విశాఖ (Visakhapatnam) నుంచి శ్రీకాకుళం (Srikakulam) వరకు కనిపించిన జనసందోహం జగన్కు ఉత్తరాంధ్రలో ఉన్న ఆదరణను మరోసారి చాటిందని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొంటున్నారు.
అదే సమయంలో మత్స్యకారుల సమస్యల (Fishermen Problems) పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సీదిరి అప్పలరాజుపై కూడా కక్షసాధింపు కొనసాగుతోందని ఉత్తరాంధ్రలోని మత్స్యకార వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల భావోద్వేగాలను ప్రభుత్వం తక్కువ అంచనా వేయొద్దని, సరైన సమయంలో తగిన సమాధానం ఇస్తామని వారు హెచ్చరిస్తున్నట్లు రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి.







