---Advertisement---

డీఎస్సీ అవకతవకలపై ఎవరు భాధ్యత తీసుకుని రాజీనామా చేస్తారు? జగన్ ప్రశ్న!

July 25, 2026

Summarize with AI

---Advertisement---

ఏపీలో డీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. ఢిల్లీలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో, అదే ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, “నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.

అదే ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా వ్యవహరిస్తారా అని ప్రశ్నించిన ఆయన, “దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును పణంగా పెడుతూ డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా?” అని నిలదీశారు.

అంతేకాకుండా, “లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ సీఎం చంద్రబాబు తన కుమారుడి పదవిని కాపాడుకుంటారా?” అంటూ ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment