ఆలూరు ఎమ్మెల్యే(Alur MLA) విరూపాక్షిని(Virupakshi) పరామర్శించేందుకు కర్నూలు (Kurnool) వెళ్లిన వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy).. కూటమి ప్రభుత్వంపై (Coalition Government) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెడ్బుక్ రాజ్యాంగంతో(Red Book Constitution) టీడీపీ (TDP) కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. విరూపాక్షిపై కుట్రపూరితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని, ఆయన ఇంటి తలుపులు, కిటికీలు ధ్వంసం చేసి పోలీసులు అరెస్ట్ చేశారని జగన్ విమర్శించారు.
విరూపాక్షిపై గంటల వ్యవధిలోనే మూడు కేసులు పెట్టారని, బాధితులనే నిందితులుగా మార్చి అరెస్టులు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పోలీసులు(Police) ఆంక్షలు (Restrictions) విధించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ర్యాలీలు, సభలు, రోడ్షోలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
జగన్ కాన్వాయ్కు (Convoy) మాత్రమే అనుమతి ఇచ్చి, ఆయనను కలిసేందుకు వచ్చే ప్రజలు, కార్యకర్తలను దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఎన్ని ఆంక్షలు విధించినా జగన్కు మద్దతుగా కర్నూలు ప్రజలు తరలివస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. జగన్ భద్రత, పర్యటనలపై ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) దృష్టికి తీసుకెళ్లిన అంశాలను కూడా వారు ప్రస్తావించారు.






