మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులకు అదిరిపోయే ట్రీట్ సిద్ధమవుతోంది. చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి (Kodandarami Reddy) కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్బస్టర్ చిత్రం ‘ముఠామేస్త్రీ’(Muta Mestri) మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాను ఇప్పుడు 4కే డిజిటల్ వెర్షన్లో (4K Digital Version) రీ రిలీజ్ (Re-release) చేయనున్నారు.
1993లో విడుదలైన ‘ముఠామేస్త్రీ’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. చిరంజీవి మాస్ ఇమేజ్కు (Mass Image) తగ్గట్టుగా రూపొందిన ఈ సినిమా ఆయన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అదే మాస్ ఫీల్ను మరోసారి బిగ్ స్క్రీన్పై ప్రేక్షకులు ఆస్వాదించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (Megastar Chiranjeevi Birthday) ఆగస్టు 22న ఉండటంతో, ఒక రోజు ముందుగానే ఆగస్టు 21న ‘ముఠామేస్త్రీ’ 4కే వెర్షన్ను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో మెగా అభిమానుల్లో ఇప్పటి నుంచే సందడి మొదలైంది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన మీనా(Meena), రోజా(Roja) కథానాయికలుగా నటించారు. రాజ్-కోటి అందించిన సంగీతం అప్పట్లో విశేషమైన ఆదరణను సొంతం చేసుకుంది. సినిమాలోని పాటలు, చిరంజీవి డాన్సులు, మాస్ మేనరిజమ్స్, పవర్ఫుల్ డైలాగ్లు ఇప్పటికీ అభిమానుల్ని ఆకట్టుకుంటూనే ఉన్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్లో పాత సూపర్హిట్ సినిమాల రీ రిలీజ్లకు మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ‘ముఠామేస్త్రీ’ 4కే వెర్షన్పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి పాత మాస్ లుక్, స్టైల్, డాన్సులు, యాక్షన్ను మరోసారి థియేటర్లో చూసేందుకు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







