వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను (Nagarjuna Yadav) గుంటూరులో (Guntur) పోలీసులు అదుపులోకి తీసుకెళ్లిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, తెలంగాణ పోలీసులమని (Telangana Police) చెప్పిన అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఆయనను ఇంటి నుంచి తీసుకెళ్లారని, దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రెండేళ్ల క్రితం జరిగిన ఒక టెలివిజన్ డిబేట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అప్పుడే కేసు నమోదై, నోటీసులు జారీ అయ్యాయని, ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణలో ఉందని చెబుతున్నారు. అయితే ఇటీవల అదే డిబేట్ వీడియో ఫేస్బుక్ మెమరీస్ (Facebook Memories) ద్వారా మళ్లీ వైరల్ కావడంతో మరోసారి కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం పౌరహక్కులకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న సమయంలో ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఈ అరెస్ట్ జరిగిందని వారు ఆరోపించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఉపయోగించుకుని ఈ చర్యకు పాల్పడ్డారని కూడా వైసీపీ నేతలు విమర్శించారు.







