మూగజీవాలపై (Animals) జరుగుతున్న దారుణాలపై నటి రేణు దేశాయ్ (Renu Desai) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బయటపడిన కుక్కల రక్తం (Dogs Blood) విక్రయాల వ్యవహారం (Sales Issue) ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎంత భయంకర దిశలో వెళ్తుందో అర్థమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. నేటి కాలంలో మనుషులనే కిడ్నాప్ చేసి, వారి కిడ్నీలను (Kidneys) తీసి అమ్మే స్థాయికి కొందరు దిగజారిపోయారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో నోరులేని కుక్కలను వదిలేస్తారని ఎలా అనుకుంటాం? అని ప్రశ్నించారు. డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారని మండిపడ్డారు.
కేవలం రక్తం అమ్మేవారినే తప్పుపట్టడం సరిపోదని, కొనుగోలు చేసే వారికీ సమాన బాధ్యత ఉందని ఆమె స్పష్టం చేశారు. “రక్తం ఎక్కడి నుంచి వచ్చింది?, ఎలా సేకరించారు?, ఆ జంతువుల పరిస్థితి ఏమిటి?” వంటి విషయాలు తెలుసుకోకుండా కొనుగోలు చేయడం కూడా తప్పేనని పేర్కొన్నారు.
మూలాలను పరిశీలించకుండా కొనుగోలు చేయడం వల్ల అక్రమ దందాలకు ప్రోత్సాహం లభిస్తుందని రేణు దేశాయ్ హెచ్చరించారు. డిమాండ్ ఉన్నంత వరకు ఇలాంటి చీకటి వ్యాపారాలు ఆగవని అన్నారు.
చివరగా కర్మ సిద్ధాంతాన్ని (Law of Karma) గుర్తుంచుకోవాలని ఆమె హితవు పలికారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఒక రోజు ఫలితం అనుభవించాల్సిందేనని అన్నారు. మనం చేసే ప్రతి కర్మ తిరిగి మన ముందుకు వస్తుందనే నిజాన్ని అందరూ నమ్మాలని సూచించారు.
మూగజీవాలపై క్రూరత్వం ఆపాలంటే కఠిన చట్టాలతో పాటు ప్రజల్లో అవగాహన కూడా పెరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






