టాలీవుడ్లో ఇటీవల నెలకొన్న పర్సంటేజీ విధాన వివాదం మధ్య తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ (Telangana State Film Chamber) అధ్యక్షుడు సునీల్ నారంగ్ (Suniel Narang) తన పదవికి రాజీనామా (Resignation) చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఏషియన్ మల్టీప్లెక్స్ల (Asian Multiplexes) అధినేతగా, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, నిర్మాతగా గుర్తింపు పొందిన సునీల్ నారంగ్ వ్యక్తిగత కారణాలతో తన పదవిని వీడుతున్నట్లు ఫిలిం ఛాంబర్కు మెయిల్ ద్వారా సమాచారం అందించారు.
ఇటీవల టాలీవుడ్లో థియేటర్లలో అమలు చేస్తున్న పర్సంటేజీ విధానంపై (Percentage System) పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో (Single Screen Theatres) కూడా పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుండగా, పలువురు అగ్ర నిర్మాతలు మాత్రం దీనికి అంగీకరించకపోవడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో సునీల్ నారంగ్పై నిర్మాతల వర్గం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ పరిణామాల మధ్య ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్కు కొత్త అధ్యక్షుడి ఎన్నిక మరో 2 రోజుల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ రాజీనామా హాట్ టాపిక్గా మారింది.






