కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై (Viswanath and Sons) ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ‘లక్కీ భాస్కర్’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి రూపొందిస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి.
తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ (Family Emotional Drama Movie) రిలీజ్ డేట్ను (Release Date) మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న (August 14) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) లాంగ్ వీకెండ్ను (Long Weekend) టార్గెట్ చేస్తూ మేకర్స్ ఈ డేట్ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. వరుస సెలవులు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల ‘కరుప్పు’(Karuppu) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూర్య అదే జోష్లో ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ ఎంపిక కూడా చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో సూర్య సరసన యంగ్ సెన్సేషన్ మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటీమణులు రాధికా శరత్కుమార్(Radhika Sarathkumar), రవీనా టాండన్ (Raveena Tandon) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ను మేళవిస్తూ వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తమిళ సంగీత సంచలనం జి.వి. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతం అందిస్తుండటంతో సినిమాపై మ్యూజిక్ లవర్స్లో కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
క్లాస్, మాస్ ఆడియెన్స్ను ఒకేసారి ఆకట్టుకునేలా రూపొందుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.






