తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రాజకీయ(Political), సామాజిక (Social) రంగాలకు చెందిన ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తమ సందేశాల ద్వారా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్తు దిశపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ సాధ్యం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాలు (Movements), వేలాది మంది ప్రజల పోరాట స్ఫూర్తి (Fighting Spirit), అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణవాసులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అమరవీరుల ఆశయాలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సీఎం, వారి త్యాగాలకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
రైతుల సంక్షేమం (Farmers’ Welfare), మహిళా సాధికారత(Women Empowerment), నిరుద్యోగ యువతకు (Unemployed Youth) ఉపాధి అవకాశాల కల్పనతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.… pic.twitter.com/tdvMrTaXBO
— Telangana CMO (@TelanganaCMO) June 1, 2026
పదేళ్లలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ: కేసీఆర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) కూడా రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల పాటు కొనసాగిన వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సాగిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ, స్వయం పాలనలో కేవలం 10 ఏళ్ల వ్యవధిలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు(Drinking Water), వ్యవసాయం(Agriculture), విద్యుత్ (Power) రంగాల్లో సాధించిన పురోగతి రాష్ట్ర అభివృద్ధికి (State Development) బలమైన పునాది వేసిందని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్న ప్రగతి (Progress), అస్తిత్వాన్ని (Identity) కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పాలకులు చిత్తశుద్ధితో అమలు చేయాలని, ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని(Farmers’ Welfare) విస్మరించరాదని హితవు పలికారు.
తెలంగాణ నిరంతరం పచ్చని పంట పొలాలతో, సుభిక్షతతో, సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కేసీఆర్ తన సందేశాన్ని ముగించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు ✨
— BRS Party (@BRSparty) June 1, 2026
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ప్రజలకు,… pic.twitter.com/oXiUuk4BMZ
ఎన్నో అవమానాలు.. అవహేళనలు..
— BRS Party (@BRSparty) June 1, 2026
మరెన్నో త్యాగాలు.. కుట్రలు..!
అయినా కేసీఆర్ ఒక్కడే ఉద్యమ జ్వాలగా మారి ✊
లక్షల మందిని పోరాట సైన్యంగా తీర్చిదిద్ది🔥
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిండు.
అప్పుటి లక్ష్యం రాష్ట్ర సాధన..
ఇప్పటి లక్ష్యం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం✊
జై తెలంగాణ ✊… pic.twitter.com/JUMu7TJDSD







