అక్కినేని హీరో సుమంత్ (Akkineni Sumanth) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton’s Third Law) మూవీ జూలై 31న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్కు సిద్ధమవుతోంది. సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బలంగా ఉండనున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ (Trailer) చూస్తే సినిమా మొత్తం ఊహించని ట్విస్టులతో నిండిపోయిందనే ఫీలింగ్ కలుగుతోంది.
ట్రైలర్లో సుమంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా (Police Officer) అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్తో కనిపించారు. ఓ అనుమానాస్పద హత్య కేసును ఛేదించే క్రమంలో కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. మరోవైపు జగపతి బాబు విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూ ప్రతి సీన్లో ఇంటెన్స్ వైబ్ తీసుకొచ్చారు. చివరి వరకు ఏం జరుగుతుందో అర్థం కాకుండా కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సుమంత్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గత 10 సంవత్సరాల్లో కథ విన్న వెంటనే ఓకే చెప్పిన సినిమాలు కేవలం 2 మాత్రమేనని, అందులో ఒకటి ‘మళ్లీ రావా’ కాగా రెండోది ‘న్యూటన్స్ థర్డ్ లా’ అని చెప్పారు. ‘అనగనగా’ సినిమా కంటే ముందే దర్శకుడు ఈ కథ వినిపించారని గుర్తు చేశారు.
ఈ సినిమాలో తన పాత్ర కంటే కథను ముందుకు నడిపించే స్క్రీన్ప్లేనే అసలైన హీరో అని సుమంత్ ప్రశంసించారు. బయటకు ఇది థ్రిల్లర్లా కనిపించినా, లోపల బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ దాగి ఉన్నాయని తెలిపారు. సినిమా టైటిల్ మార్చాలని చాలామంది సూచించినా, కథకు ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton’s Third Law) పేరే పర్ఫెక్ట్ అని తాను గట్టిగా నిలబడ్డానన్నారు. ట్రైలర్లో చూపించింది చాలా తక్కువ మాత్రమేనని, అసలు సస్పెన్స్లు థియేటర్లలో ప్రేక్షకులను షాక్కు గురిచేస్తాయని చెప్పారు.






