ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. అనకాపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్లలో (Panchadarla) జరుగుతున్న అక్రమ మైనింగ్కు (Illegal Mining) వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ(YSRCP) చేపట్టిన ‘ఛలో పంచదార్ల'(Chalo Panchadarla) కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కూటమి ప్రభుత్వం, స్థానిక నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవిత్ర క్షేత్రంలో జరుగుతున్న తవ్వకాల కారణంగా అక్కడి నీటి రంగు కూడా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రమేశ్ను (CM Ramesh) ఉద్దేశిస్తూ “కరప్షన్ మ్యాన్ రమేశ్” (Corruption Man Ramesh) అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన అమర్నాథ్, స్వార్థ ప్రయోజనాల కోసం పవిత్ర క్షేత్రాల పవిత్రతను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని హెచ్చరిస్తూ, “పరమశివుడు (Lord Shiva) మూడో కన్ను (Third Eye) తెరిస్తే వీరంతా భస్మం కాక తప్పదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వెంటనే పంచదార్ల ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమరావతి అంశంపైనా అమర్నాథ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజధాని నిర్మాణం (Capital Construction) పేరుతో కూటమి ప్రభుత్వం (Alliance Government) ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. అమరావతిని దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్గా మార్చేశారని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ‘రెడ్ బుక్’ (Red Book) కాదు, పారిశ్రామికవేత్తలకు ‘రెడ్ కార్పెట్’ (Red Carpet) పరచాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
చంద్రబాబు(Chandrababu Naidu), లోకేష్లు(Nara Lokesh) పెట్టుబడుల పేరుతో ప్రపంచ దేశాలు తిరుగుతున్నా రాష్ట్రానికి 1 రూపాయి కొత్త పెట్టుబడి కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ (YS Jagan) హయాంలో వచ్చిన ప్రాజెక్టులు(Projects), సాధించిన అభివృద్ధినే ఇప్పుడు తమ విజయాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. పంచదార్ల పుణ్యక్షేత్రం, పరిసర కొండలను అక్రమ మైనింగ్ నుంచి పూర్తిగా కాపాడే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని అమర్నాథ్ స్పష్టం చేశారు.







