---Advertisement---

విశాఖలో నడకకే పన్నా? ప్రజలపై కొత్త భారంతో కలకలం!

April 23, 2026

---Advertisement---

మహా విశాఖ నగరంలో ఇప్పుడు సాధారణ నడక కూడా ఖర్చుతో కూడుకున్నదిగా మారిందా అనే ప్రశ్నలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మున్సిపల్ స్టేడియాలు మరియు ప్రభుత్వ పార్కుల్లో నడవాలంటే ఒక్కో వ్యక్తి రూ.720 చెల్లించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్3 స్పోర్ట్స్ అరెనా, శివాజీ పార్క్, ముడసర్లోవ పార్క్ వంటి ప్రదేశాల్లో యూజర్ ఛార్జీలు తప్పనిసరి చేస్తూ బ్యానర్లు వెలసిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జగన్ పాలనలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ పార్కులు, స్టేడియాలు అభివృద్ధి చేయబడ్డాయని, కానీ ప్రస్తుతం అదే సౌకర్యాలను ఆదాయ వనరుగా మార్చి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు అర్హత లేని పరిశ్రమలకు తక్కువ ధరలకు భూములు కేటాయిస్తుండగా, మరో వైపు కోట్ల విలువైన ప్రభుత్వ భూముల విషయంలో సడలింపులు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గీతం సంస్థకు సంబంధించిన భూముల విషయంలో నిబంధనలు పాటించకపోయినా చర్యలు తీసుకోకుండా ప్రయోజనం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం నడిచే సాధారణ ప్రజలపైనే ఆర్థిక భారం మోపడం సమంజసమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశాఖ వాసులు ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment