---Advertisement---

Ys Jagan: రేపు విశాఖ పర్యటన.. స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్ .

June 9, 2026

Summarize with AI

---Advertisement---

విశాఖపట్నం (Visakhapatnam) స్టీల్ ప్లాంట్‌లో (Steel Plant)‌ జరిగిన ఘోర ప్రమాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల (Workers) కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) రేపు విశాఖపట్నానికి వెళ్లనున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పడంతో పాటు వారి పరిస్థితిని తెలుసుకోనున్నారు.

అదేవిధంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను కూడా ఆసుపత్రిలో వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం.

సోమవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 150 టన్నుల ద్రవ ఉక్కును (Molten Steel) తరలిస్తున్న భారీ లాడెల్ (Heavy Ladle) నుంచి ఒక్కసారిగా ద్రవ ఉక్కు విస్ఫోటనం చెందింది. ఈ ఘటనలో ద్రవ ఉక్కు కార్మికులపై పడటంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, కార్మిక సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment